యాప్నగరం

ఏపీలో టెన్త్ విద్యార్థులకు శుభవార్త

పదో తరగతి విద్యార్థులకు సప్తగిరి ఛానల్‌లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి క్లాసులు.

Samayam Telugu 8 Apr 2020, 10:11 am
ఏపీలో టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం నుంచి విద్యార్థుల కోసం ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించి క్లాసులు ప్రత్యక్ష ప్రసారం చేస్తన్నారు.
Samayam Telugu 10th


ఛానల్‌లో వచ్చే ఈ క్లాసులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు విద్యార్థుల హాజరుకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బంది విద్యా శాఖకు సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయులు కూడా హాజరును పరిశీలించనున్నారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులకు ఇలా పాఠాలను బోధించడానికి ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా, లాక్‌డౌన్ దెబ్బకు స్కూళ్లన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాయి. ఇప్పుడు టెన్త్ విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటు పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.