యాప్నగరం

డిసెంబర్ 31లోగా డీఎస్సీ నోటిఫికేషన్

డిసెంబర్ చివరి లోగా డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది.

TNN 2 Dec 2017, 10:39 pm
డిసెంబర్ చివరి లోగా డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఉపాధ్యాయ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
Samayam Telugu ap govt to release dsc notification with 9259 posts
డిసెంబర్ 31లోగా డీఎస్సీ నోటిఫికేషన్


ఆంధ్రప్రదేశ్‌లో 9259 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని సీనియర్‌ న్యాయవాది ఏకే గుప్తా కమిటీ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తున్నామని 2018 జులై లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.