యాప్నగరం

AP: ఈనెల 15 లోగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు..!

ఏపీలో 16,208 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాతపరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Samayam Telugu 8 Oct 2020, 5:01 pm
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్షల ఫలితాలను మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15వ తేదీ కల్లా ఫలితాల వెల్లడి పూర్తవుతుందని తెలిపాయి. ఆ తర్వాత మరో వారం రోజుల వ్యవధిలోనే జిల్లా సెలక్షన్‌ కమిటీల ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.
Samayam Telugu గ్రామ వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు


మొత్తం 19 కేటగిరీల్లో 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాతపరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం 10,57,355 మంది దరఖాస్తు చేసుకోగా.. 7,69,034 మంది పరీక్షలకు హాజరయ్యారు.

రాతపరీక్షలకు సంబంధించిన ఫైనల్‌ కీని ఏపీపీఎస్‌సీ అధికారులు గురువారం ప్రకటించే అవకాశాలున్నాయి. కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

జవాబుల ఓఎమ్మార్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థుల జవాబుల వివరాలతో పైనల్‌ కీ అనుసంధానం చేసి మార్కుల జాబితాలను తయారు చేయనున్నారు.

ఈ ప్రక్రియ ముగియగానే ర్యాండమ్‌గా కొందరు అభ్యర్థుల మార్కులు కంప్యూటరీకరణ ప్రక్రియ ద్వారా, ప్రత్యక్ష పరిశీలనలోనూ మార్కుల వివరాలను సరిపోల్చనున్నారు. ఆ తర్వాత రాతపరీక్షల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.