యాప్నగరం

AP ICET 2018: ఏపీ ఐసెట్‌ 2018 ఫలితాలు..

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసన్న పవన్‌ కుమార్‌ ఐసెట్ స్టేట్ టాపర్‌గా నిలిచాడు.

Samayam Telugu 12 May 2018, 1:52 pm
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మావవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం (మే 12) మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసన్న పవన్‌ కుమార్‌ ఐసెట్ స్టేట్ టాపర్‌గా నిలిచాడు. వెంకట నరసుగారి భరత్‌కుమార్‌ (అనంతపురం), నుసుమ్‌ సాయికుమార్‌ రెడ్డి (అనంతపురం) వరసగా రెండో, మూడో ర్యాంక్ సాధించారు. ఐసెట్‌లో ఈసారి 92.60 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి గంటా తెలిపారు.
Samayam Telugu results


జూన్‌ 20 నుంచి ఐసెట్‌ 2018 కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహించింది.

ఏపీ ఐసెట్ 2018 టాప్‌ టెన్ ర్యాంకర్లు
1. చింతగుంట్ల ప్రసన్న పవన్‌కుమార్‌ (గుంటూరు)
2. విఎన్ భరత్‌కుమార్‌ (అనంతపురం)
3. ఎన్ సాయికుమార్‌ రెడ్డి(అనంతపురం)
4. హర్షవర్ధన్‌ (అనంతపురం)
5. ఎస్ శ్రీహర్షవర్ధన్‌ (కృష్ణా)
6. బొర్రా శ్రీదీప్తి (శ్రీకాకుళం)
7. కాకాని వాసు కృష్ణకుమార్‌ (విశాఖపట్నం)
8. కూన వెంకటలక్ష్మీ నారాయణరావు (విశాఖపట్నం)
9. డి వెంటసాయి మనోజ్‌బాబు (శ్రీకాకుళం)
10. ఒ భానుప్రకాశ్‌ (చిత్తూరు)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.