యాప్నగరం

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

TNN 22 Jun 2016, 11:32 am
ఏపీలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ బుధవారం ఉదయం కడపలో ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 3 లక్షల 38 వేల 256 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా.. 2 లక్షల 58 వేల,132 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 76 శాతం వరకు నమోదైంది. ఇందులో బాలికల ఉత్తర్ణత శాతం 79 ఉండగా..బాలుర ఉత్తీర్ణత 74 శాతంగా నమోదైంది. ఇక సెకండియర్ విషయానికి వస్తే మొత్తం లక్షా 12 వేల 884 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా.. 54 వేల 932 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతశాతం 48.7 శాతంగా నమోదైంది. ఇందులో బాలికల ఉత్తీర్ణత 50 శాతం నమోదు కాగా బాలుర ఉత్తీర్ణత 48 శాతంగా నమోదైంది.
Samayam Telugu ap inter advanced results released by minister ganta
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల


ఫలితాల విడుదల సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మార్కుల మెమో ఈ నెల 29 తర్వాత కాలేజీలకు పంపుతామన్నారు. అలాగే రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయదల్చుకున్నవారు ఒక్కో పేపర్ కు రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. సమాధాన పత్రాలు స్కాన్ కాఫీలు కోసం ఒక్కో పేపర్ కు రూ.720 చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు జూలై 2 లోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. ఈ ఫలితాల విదుదల కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సత్యనారాయణ, ఉప కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.