ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మ.12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 2 నుంచి 6 వరకు నిర్వహిస్తున్నారు. జూన్ 7న నీతి, మానవ విలువల పరీక్ష, జూన్ 8న పర్యావరణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇంటర్ బోర్టు కార్యదర్శి ఎం.వి సత్యానారాయణ ప్రకటన విడుదల చేశారు.
మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
TNN 30 Apr 2016, 10:37 am