యాప్నగరం

AP Inter Exams 2023 : హాల్‌టికెట్లు ఇవ్వకపోతే ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయండి.. విద్యార్థులకు కమిషనర్‌ సూచన

AP Inter Admit Card 2023 : విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులూ పెట్టకుండా కాలేజీల యాజమాన్యాలు హాల్‌టికెట్లు జారీ చేయాలని ఏపీ ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 17 Feb 2023, 11:20 am
AP Inter Hall Ticket 2023 : ఏపీ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులూ పెట్టకుండా కాలేజీల యాజమాన్యాలు హాల్‌టికెట్లు జారీ చేయాలని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశించారు. ఏదైనా కాలేజీ, యాజమాన్యం హాల్‌టికెట్లను ఇవ్వకుండా ఇబ్బంది పెడితే టోల్‌ఫ్రీ నంబరు 18004257635 కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయొచ్చని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభం కానున్నాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3న, సెకండియర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 4న ముగుస్తాయి.
Samayam Telugu AP Inter Hall Ticket 2023


ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ:
ఇక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ (EAPCET) కు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఈ పరీక్షలో ఇంటర్ మార్కులకు వెయిటేజీని గతంలో మాదిరిగానే ఇవ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో మొత్తం 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా 2020-21, 2021-2022లో విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించలేదు. దీంతో ఇంటర్ మార్కులకు వెయిటేజీని కూడా ఇవ్వలేదు.

ప్రస్తుతం ఈఏపీసెట్ రాస్తున్న విద్యార్థులు గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయగా.. ఈ ఏడాది సెకండియర్ ఎగ్జామ్స్ కూడా రాయనున్నారు. దీంతో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ లో వెయిటేజీని పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సారి ఈఏపీసెట్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు సంబంధించి కేవలం 70 శాతం సిలబస్ ను మాత్రమే ఇవ్వనున్నారు. గతేడాది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కేవలం 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు రాయడం ఇందుకు కారణం. సెకండియర్ నుంచి మాత్రం పూర్తి సిలబస్ ఉంటుంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.