యాప్నగరం

JIO TV: జియో టీవీలో ఇంటర్‌ పాఠాలు.. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు ప్రసారం

జియో టీవీలో ఇంటర్‌ పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి తెలిపింది.

Samayam Telugu 8 Dec 2020, 3:10 pm
ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. కరోనా కారణంగా విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థుల కోసం జియో టీవీలో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu ఏపీ ఇంటర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు


జియో టీవీ ద్వారా ఈరోజు (డిసెంబర్‌ 8) ఉదయం 6 నుంచి రాత్రి 8.30 గంటలవరకు విద్యార్థులు పాఠాలు వీక్షించవచ్చని చెప్పారు. ఈవిధంగా పరీక్షలు ముగిసే వరకు వీటిని ప్రసారం చేస్తారు. అలాగే.. ఇవే పాఠ్యాంశాలను ఇంటర్‌ విద్యామండలికి చెందిన bieap virtual class అనే యూట్యూబ్‌ ఛానల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

త్వరలో ఇంటర్‌ ఫస్టియర్‌ పాఠ్యాంశాలతో పాటు జేఈఈ, ఎంసెట్‌, నీట్‌ పాఠాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Must read: ఎగ్జామ్స్ వాయిదా వేయండి.. సిలబస్ కుదించండి.. విద్యాశాఖకు విద్యార్థుల విజ్ఞప్తి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.