యాప్నగరం

Manabadi AP Inter Result 2023 : ఇంటర్‌ మార్కులపై సందేహాలున్నాయా..? అయితే ఇలా చేయండి

AP Inter 1st, 2nd Year Results 2023 : ఏపీ ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని అధికారులు సూచించారు. ఏప్రిల్‌ 27 నుంచి..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 27 Apr 2023, 10:25 am
AP Inter Results 2023 Manabadi : ఏపీ ఇంటర్‌ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులతో కలిసి ఇంటర్‌ ఫలితాలను విడదల చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,66,326 (61శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో బాలికలు 65 శాతం, బాలురు 58 శాతం ఉన్నట్టు చెప్పారు.
Samayam Telugu AP Inter Result 2023


కృష్ణా జిల్లా ప్రథమ స్థానం.. చివరి స్థానంలో విజయనగరం
ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలకు 3,79,750 మంది విద్యార్థులు హాజరు కాగా.. 2,72,001 మంది(72శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు75 శాతం, బాలురు 58 మంది ఉన్నారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 70 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 68 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. సెకండ్‌ ఇయర్‌లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా మొదటి స్థానంలో నిలవగా, 78శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానం, 77శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి తృతీయ స్థానంలో నిలిచాయని మంత్రి తెలిపారు. విద్యాశాఖమంత్రి సొంత జిల్లా విజయనగరం ఫలితాల్లో చివరి స్థానంలో ఉంది. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విష‌యం తెలిసిందే.

Manabadi AP Inter Results 2023 : ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ లింక్‌ ఇదే

మే 6 వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం:ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని అధికారులు సూచించారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 6 వరకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది. పరీక్ష ఫెయిల్‌ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ కోసం మే 24 నుంచి జూన్‌ 1 వరకు వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు త్వరలో విడుదల చేయనుంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.