యాప్నగరం

రేపే ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఏపీలో రేపు (శుక్రవారం) ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్ల పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

Samayam Telugu 11 Jun 2020, 3:48 pm
ఏపీలో రేపు (శుక్రవారం) ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను రేపు మధ్యాహ్నం 12. 30 తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.
Samayam Telugu ఇంటర్‌ ఫలితాలు


కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. దీంతో రేపు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది.

మార్చి 4 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ జరిగిన సంగతి విదితమే. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.