యాప్నగరం

AP Board Results 2018: ఏప్రిల్ 12, 13 తేదీల్లో ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. గత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 11 Apr 2018, 7:23 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. గత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12, 13 తేదిల్లో విడుదల చేయనున్నారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలోని షల్టన్ హోటల్‌ ఏప్రిల్ 12 న మధ్యాహ్నం 3 గంటలకు ద్వితీయ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మర్నాడు అంటే ఏప్రిల్ 13న ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలను కూడా మంత్రి విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ఏడాది ఫలితాలను విడుదల చేస్తారు. ఏపీ ఇంటర్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Samayam Telugu ఏపీ ఇంటర్ ఫలితాలు


ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,31,285 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,08,126 మంది ఉన్నారు. వీరికి జనవరి 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష నిర్వహించగా, అదే నెల 29న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష కూడా నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు జరిగాయి. జనరల్‌తోపాటు వొకేషనల్ విద్యార్థులకు ఇవే తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది నుంచే ఇంటర్‌లో గ్రేడిండ్ విధానం అమలు చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మార్కుల స్థానంలో గ్రేడింగులు ఇవ్వనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.