యాప్నగరం

AP Inter 2nd Year Results: నేడు సెకెండియర్ ఫలితాలు.. టీవీలోనూ రిజల్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Samayam Telugu 12 Apr 2018, 3:38 pm
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్‌ ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. రాజమహేంద్రవరంలోని షల్టన్‌ హోటల్‌ లో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. ద్వితీయ ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు విద్యాశాఖాధికారులు వెల్లడించారు. అలాగే పరీక్ష ఫలితాలను టీవీలోనూ తెలుసుకునేలా వినూత్న అవకాశం కల్పించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థ ఫలితాలను టీవీలో నేరుగా ప్రసారం చేయనుంది. టీవీ తెరపై పరీక్ష ఫలితాలకు సంబంధించిన సూచీ కనిపిస్తుందని, దీనిపై రిమోట్‌‌తో ప్రెస్‌ చేసి, హాల్‌ టికెట్‌ నెంబర్‌ ఎంటర్ చేస్తే విద్యార్థికి సంబంధించిన రిజల్ట్ కనబడుతుందని అధికారులు తెలిపారు. ఫలితాలను తెలుసుకోవడానికి కింద ఇచ్చిన బాక్సులో మీ వివరాలను ఎంటర్ చేయండి.
Samayam Telugu గంటా శ్రీనివాసరావు



Also Read: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

దీంతో పాటు www.rtgs.ap.gov.in వెబ్‌సైట్‌, పీపుల్‌ ఫస్ట్‌, సిటిజన్‌ మొబైల్‌, ఏపీ సీఎం కనెక్ట్‌, ఖైజాలా యాప్‌లోనూ ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు. ఏప్రిల్ 13 న విశాఖలో ఫస్టియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏయూ ప్రాంగణలో వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. గతానికి భిన్నంగా రాజధానిలో కాకుండా ఇతర నగరాల్లో ఇంటర్ ఫలితాలను వెల్లడించడం విశేషం. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.


Also read: AP Intermediate Result 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.