యాప్నగరం

ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు

ఈ ఏడాది ఏపీలోని 32 న్యాయ కళాశాలలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది.

Samayam Telugu 19 Sep 2018, 12:38 am
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఎట్టకేలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైంది. సెప్టెంబరు 25, 26, 27 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. న్సెలింగ్‌ కోసం అనంతపురం, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ర్యాంకుల వారీగా కౌన్సిలింగ్ పూర్తి షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నారు.
Samayam Telugu AP LAWCET


అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 19న లాసెట్‌ నిర్వహించి, మే 14న ఫలితాలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయకళాశాలల్లో 8 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. 12 వేల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 32 న్యాయ కళాశాలలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.