యాప్నగరం

AP Polycet counselling 2020: ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

ఏపీ పాలిసెట్‌-2020 ప్రవేశాల షెడ్యూల్‌ గడువును పొడిగించారు.

Samayam Telugu 18 Oct 2020, 1:20 pm
ఏపీ పాలిసెట్‌-2020 ప్రవేశాల షెడ్యూల్‌ గడువును పొడిగించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరికీ మరోసారి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలిసెట్‌లో 60,780 మంది అర్హత సాధించగా.. వీరిలో కౌన్సెలింగ్‌కు 35,346మంది నమోదు చేసుకున్నారు. సీట్ల ఎంపికకు 28,682 మంది మాత్రమే ఆప్షన్లు ఇచ్చారు.
Samayam Telugu ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ 2020


దీంతో మరోసారి అవకాశం కల్పించేందుకు గడువు పొడిగించారు. ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపునకు అక్టోబ‌రు 21 వరకు.. ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల ఎంపికకు ఆప్షన్లకు 22 వరకు గడువు ఇచ్చారు. సీట్ల కేటాయింపు అక్టోబ‌రు 24న ఉంటుంది.

ఏపీ పాలిసెట్‌ 2020 ఫలితాలను ఈనెల 9న విడుదల చేశారు. ఈ ఏడాది ఈ పరీక్షకు 88,372 మంది అభ్యర్థులు నమోదు చేసుకొన్నారు. అందులో 71,631 మంది పరీక్ష రాయగా 84 శాతంతో 60,780 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 50,706 మంది పరీక్షలు రాయగా 42,313 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 20,925 మంది పరీక్షలు రాయగా 18,467 మంది ఉత్తీర్ణత సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.