యాప్నగరం

ఏపీ: షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు జరుగుతాయి: మంత్రి సురేష్‌

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా స్పందించారు.

Samayam Telugu 10 Jun 2020, 2:56 pm
పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా స్పందించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.
Samayam Telugu టెన్త్‌ పరీక్షలు


కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పది పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా స్పందించారు.

ఏపీలో అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసినా.. ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని.. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 10 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపారు.

వీటి కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని.. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. విద్యార్ధులను ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.