యాప్నగరం

Summer Holidays 2022: రేపటి నుంచి జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు.. ఎప్పటి వరకో తెలుసా..?

Summer Holidays for Inter colleges: ఏపీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్‌. వేసవి సెలవులకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ ప్రకటించింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 24 May 2022, 10:52 am
AP Colleges Summer Holidays: ఏపీలో రేపటి (మే 25) నుంచి జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈసెలవులు జూన్‌ 19 వరకు కొనసాగనున్నాయి. తిరిగి జూన్‌ 20వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం కానున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి ప్రకటించింది.
Samayam Telugu AP Summer Holidays 2022
ఏపీలో రేపటి (మే 25) నుంచి జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈసెలవులు జూన్‌ 19 వరకు కొనసాగనున్నాయి.


AP EAPCET 2022: ఎంసెట్‌ రాసే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏడాది ర్యాంకుల కేటాయింపు ఇలా..
ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AP EAPCET)కు సంబంధించి ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాది చదివిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు కరోనా కారణంగా మార్చిలో పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులందరికీ కనీస ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. ఎవరైనా ఎక్కుడ మార్కులు ఎక్కువ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని ఇంటర్‌ విద్యామండలి సూచించింది.

Railway Jobs: రాత పరీక్ష లేకుండా.. రైల్వేలో 2077 ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు
చాలా మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఎవరైనా అభ్యర్థులు ఈ పరీక్షలు రాయకపోతే నష్టపోతారనే ఉద్దేశంతో ఇంటర్‌ మార్కులను వెయిటేజీని తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో 30శాతం సిలబస్‌ తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఉండవు.

2.60 లక్షల మందికి పైగా దరఖాస్తు:ఇక AP EAPCET 2022 పరీక్షకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 10వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 2.60 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,88,417 మంది, బైపీసీ స్ట్రీమ్‌కు 86వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుముతో ఈ సంఖ్య మరికొంత పెరగనుంది. జూలై 4 నుంచి 8 వరకు పది సెషన్లలో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ విద్యార్థులకు.. అలాగే, జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు ఏపీ ఈఏపీసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.