యాప్నగరం

AP TET Result 2022: నేడే ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. aptet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

aptet.apcfss.in Result 2022: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలు సెప్టెంబర్‌ 14న విడుదల కానున్నాయి. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన పరీక్షలు.. ఆగస్టు 21న ముగిశాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 14 Sep 2022, 9:06 am
Samayam Telugu AP TET Result 2022
AP TET Results 2022: ఏపీ టెట్(AP TET 2022) ఫలితాలు ఈనెల 14న విడుదలకానున్నాయి. ఇప్పటికే ఆన్సర్‌ కీ విడుదలైంది. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన పరీక్షలు.. ఆగస్టు 21న ముగిశాయి. 2018 తర్వాత మళ్లీ ఈ ఏడాదే టెట్‌ నిర్వహించడంతో ఈసారి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే.. రాష్ట్రంతో పాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక.. ఏపీ టెట్‌ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ఆగస్టు 31న విడుదల చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం సెప్టెంబర్‌ 12న ఫైనల్‌ కీ .. సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేస్తారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చు.

AP TET 2022 ముఖ్య సమాచారం:
  • నోటిఫికేషన్ విడుదల: జూన్‌ 10,2022
  • దరఖాస్తు రుసుములు చెల్లింపులు: జూన్‌ 15 నుంచి జులై 15 వరకు.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 16 నుంచి జులై 16 వరకు.
  • హెల్ప్ డెస్క్ సేవలు: జూన్‌ 13 నుంచి ప్రారంభం.
  • ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: జులై 26 నుంచి
  • హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్: జులై 25 నుంచి
  • పరీక్షల నిర్వహణ: 06.08.2022 నుంచి 21.08.2022 వరకు జరుగుతాయి.
  • ప్రాథమిక కీ విడుదల: 31.08.2022
  • అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 నుంచి 07.09.2022.
  • ఫైనల్‌ కీ విడుదల: 12.09.2022.
  • ఫలితాల విడుదల: 14.09.2022
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.