యాప్నగరం

AP TET 2022 Notification: ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే

AP TET 2022 Exam: ఈ టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం.. నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష ఫీజు తదితర వివరాలకు http://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 10 Jun 2022, 12:50 pm
AP TET Notification 2022: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2022) టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ AP TET 2022 పరక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనికి ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
Samayam Telugu AP TET 2022 Notification


అభ్యర్థులు ఆన్‌లైన్‌లో AP TET 2022 పరీక్షకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెట్ దరఖాస్తు ఫీజును ఒక్కో పేపర్‌కు రూ.500గా నిర్ణయించారు. టెట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ జూన్ 16 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు జులై 16 వరకు గడువు ఉంటుంది.

అర్హతలు: పేప‌ర్‌ను బ‌ట్టి ఇంట‌ర్మీడియ‌ట్‌, బ్యాచిల‌ర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్‌/ యూజీడీపీఈడీ/ డీపీఈడీ/ బీపీఈడీ లేదా త‌త్సమానం. 2020-22 విద్యా సంవ‌త్సరం చివ‌రి ఏడాది చ‌దివే అభ్యర్థులూ అర్హులే.

పరీక్షా సమయం:
  • సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు
  • సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు

క‌మ్యూనిటీ వారీగా ఉత్తీర్ణతా మార్కులు
  • ఓసీ(జనరల్‌)- 60% మార్కులు ఆపైన‌
  • బీసీ- 50% మార్కులు ఆపైన‌
  • ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌- 40% మార్కులు ఆపైన‌

ఇతర సమాచారం:
  • ప‌రీక్ష కేంద్రాలు: ఏపీకి చెందిన అన్ని జిల్లాల‌తో పాటు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నై.
  • పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష
  • పరీక్ష ఫీజు: రూ.500
  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:
  • నోటిఫికేషన్ విడుదల: జూన్‌ 10,2022
  • దరఖాస్తు రుసుములు చెల్లింపులు: జూన్‌ 15 నుంచి జులై 15 వరకు.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 16 నుంచి జులై 16 వరకు.
  • హెల్ప్ డెస్క్ సేవలు: జూన్‌ 13 నుంచి ప్రారంభం.
  • ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం: జులై 26 నుంచి
  • హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్: జులై 25 నుంచి
  • పరీక్షల నిర్వహణ: 06.08.2022 నుంచి 21.08.2022 వరకు జరుగుతాయి.
  • ప్రాథమిక కీ విడుదల: 31.08.2022
  • అభ్యంతరాల స్వీకరణ: 01.09.2022 నుంచి 07.09.2022.
  • ఫైనల్‌ కీ విడుదల: 12.09.2022.
  • ఫలితాల విడుదల: 14.09.2022.

టెట్‌ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ కల్పించనున్నారు. అలాగే బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించారు. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజ్‌ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అర్హత సాధించినవారు కూడా మళ్లీ పరీక్ష రాయనున్నారు. ఇక టెట్‌ అర్హత సర్టిఫికెట్‌కు గతంలో ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటు ఉండగా, తాజాగా జీవితకాలం చెల్లుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సో.. ఇంకెందుకు ఆలస్యం బీరెడీ..!
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.