ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగ నియామక ప్రకటన మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి జులై 15నే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. పోస్టుల సంఖ్య, వయో పరిమితి, సిలబస్ కొలిక్కి రాకపోవడంతో ఆలస్యమైందని.. ఈ అంశాలపై స్పష్టం వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశముందని.. ఆ తర్వాతే ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని ద్వివేది స్పష్టం చేశారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే వారంరోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. రాత పరీక్ష ద్వారానే గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేస్తామని.. పూర్తి పారదర్శకంగా గ్రామ సచివాలయ నియామకాలను నిర్వహిస్తామన్నారు. నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూస్తామని.. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని ద్వివేది సూచించారు. జులై 22న ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
AP Village Secretary: గ్రామ సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ ఎప్పుడంటే?
AP Grama sachivalayam Jobs| విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జులై 22న నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీనిద్వారా దాదాపు లక్షన్నర గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Samayam Telugu 19 Jul 2019, 12:57 pm
ప్రధానాంశాలు:
- ఇప్పటికీ కొలిక్కిరాని చాలా అంశాలు
- మరింత ఆలస్యం కానున్న నియామక ప్రకటన
- జులై 22న ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశం