యాప్నగరం

APPSC Group 1 : ఈనెల 31న ఏపీ గ్రూప్‌-1 హాల్‌టికెట్లు విడుదల.. జనవరి 8న ప్రిలిమ్స్‌ పరీక్ష.. పూర్తి వివరాలివే

APPSC Group 1 Hall Ticket Download 2022 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 92 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా APPSC Group 1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని ప్రకటించింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 29 Dec 2022, 8:52 pm
APPSC Group 1 Hall Ticket 2022 : ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 పోస్టులకు సంబంధించి డిసెంబర్‌ 31న హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 92 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా APPSC Group 1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీని ప్రకటించింది. జనవరి 8న గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నట్లు APPSC వెల్లడించింది.
Samayam Telugu APPSC Group 1 Hall Ticket 2022


APPSC Group 1 పరీక్షను జనవరి 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. మొత్తం 18 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఈనెల 31 నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. APPSC వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

TSPSC Group 2 Notification : తెలంగాణ గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ విడుదల.. విభాగాల వారీగా ఖాళీలు, పూర్తి వివరాలివే

ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల..? ఏప్రిల్‌ లేదా మే నెలలో మెయిన్స్‌ పరీక్షలు..!

Police Jobs : 1458 పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్‌ పాసైన వాళ్లు అర్హులు
CRPF recruitment 2022: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 1458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 1458 పోస్టుల్లో.. 143 పోస్టులు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ స్టెనో ర్యాంకు గల పోస్టులు. మిగిలినవి 1315 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ 2023, జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. అప్లికేషన్ల సమర్పణకు గడువు జనవరి 25గా నిర్ణయించారు.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.