యాప్నగరం

APPSC Group 2 Result 2024 Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలపై ప్రకటన వచ్చేసింది!

AP Group 2 Result 2024 : ఏపీలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 21 Mar 2024, 3:22 pm
APPSC Group 2 Results 2024 Date : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు వారం రోజుల్లో వెలువడనున్నట్లు ఏపీపీఎస్సీ స‌భ్యుడు ప‌రిగె సుధీర్ ‘ఎక్స్‌’ వేదిక‌గా వెల్లడించారు. మెయిన్స్‌ పరీక్షకు (Mains) 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో ప్రశ్నాలు కఠినంగా వచ్చాయని అభ్యర్థులు అన్నారు. దీంతో ఏపీపీఎస్సీ(APPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 1:50 (ఒక పోస్టుకు 50 మంది) నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేసేందుకు ఏపీపీఎస్సీ (APPSC) నిర్ణయించింది.
Samayam Telugu APPSC Group 2 Results 2024
ఏపీ గ్రూప్‌-2 రిజల్ట్స్‌ 2024


తాజాగా.. 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి పరీక్ష మెయిన్స్ (Group 2 Mains)కు ఎంపిక చేయలని బోర్డు నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. పేపర్ కఠినంగా రావడంతో 1 : 100 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 899 గ్రూప్-2 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. త్వరలో మెయిన్స్‌ పరీక్ష తేదీలు కూడా వెల్లడికానున్నాయి.

కాగా.. ఈ గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC) తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఇక.. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష (Screening Test) ఫలితాలను వారం రోజుల్లో ప్రకటిస్తామని తాజాగా వెల్లడించారు. అలాగే.. గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్ ను జూన్/జులైలో నిర్వహించనున్నట్లు సమాచారం. మెయిన్స్‌లో రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.