యాప్నగరం

APPSC: AEE సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు వెల్లడి..

APPSC AEE Recruitment | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ మె యిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1 : 2 నిష్పత్తిలో ధ్రవపత్రాల పరిశీలనకు అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపికచేసింది..

Samayam Telugu 12 Dec 2019, 10:20 am
ఏపీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం (డిసెంబరు 11) వెల్లడించింది. వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూలును అందుబాటులో ఉంచింది. షెడ్యూలు ప్రకారం మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 10 వరకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు.
Samayam Telugu AEE HT

సర్టిఫికేట్ల పరిశీలన షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్, చెక్ లిస్ట్, అటెస్టేషన్ పత్రాలను ఇప్పటికే ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది.

ఏపీలో వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సంబంధించి మే 14, 15 తేదీల్లో నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ డిసెంబరు 2 విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1 : 2 నిష్పత్తిలో 527 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది.

Read Also: సదరన్ రైల్వేలో 3,585 అప్రెంటిస్ పోస్టులు


రాష్ట్రంలోని మొత్తం 309 ఏఈఈ పోస్టుల భర్తీకి న‌వంబ‌ర్ 29న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 17న ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ పరీక్ష) నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఫిబ్రవరి 25న విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్ 18న తుది 'కీ'తోపాటు స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించింది.

Read Also: ఇంటర్ అర్హతతో 'కేంద్ర' కొలువులు.. దరఖాస్తు చేసుకోండి


స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షల నిర్వహించారు. జూన్ 5న ప్రాథమిక కీని, ఆగస్టు 29న రివైజ్డ్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబరు 2న మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ధ్రవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.

Dont Miss: ECIL'లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు.. అర్హతలివే


Read More . . .


మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.