యాప్నగరం

APPSC Recruitment: మే నెలలో 'గ్రూప్‌-2' నోటిఫికేషన్‌!

గ్రూప్-2 నోటిఫికేషన్‌తోపాటు రాబోయే రెండునెలల్లో మరో 9 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. షెడ్యూలు ప్రకారమే పంచాయతీ కార్యదర్శి పరీక్ష అని వెల్లడించారు.

Samayam Telugu 15 Apr 2019, 7:15 pm

ప్రధానాంశాలు:

  • నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
  • మరోసారి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు ఏపీపీఎస్సీ సన్నాహాలు
  • రెండు నెలల్లోపు మరో 9 ఉద్యోగ ప్రకటనలు
  • ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ వెల్లడి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu APPSC
ఏపీలో ఉద్యోగ నియామకాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మరిన్ని ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చేనెలలో 'గ్రూప్‌-2' నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ సోమవారం (ఏప్రిల్ 15) వెల్లడించారు. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌తోపాటు రాబోయే రెండునెలల్లో మొత్తం 9 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
గతేడాది నవంబర్‌ నుంచి 33 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినట్లు ఉదయభాస్కర్ తెలిపారు. ఏప్రిల్ 21న నిర్వహించనున్న పంచాయతీ కార్యదర్శి పరీక్ష వాయిదా పడదని.. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే.. స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓఎంఆర్‌ విధానంలోనే పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని ఉదయభాస్కర్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.