యాప్నగరం

APPSC Group 3 Application: పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

జనవరి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జనవరి 18 లోగా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లిచాల్సి ఉంటుంది.

Samayam Telugu 3 Jan 2019, 7:33 pm
ఏపీలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురువారం (డిసెంబరు 27) సాయంత్రం ప్రారంభమైంది. అభ్యర్థలు గురువారం నుంచి జనవరి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జనవరి 18 లోగా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లిచాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
Samayam Telugu ap Panchayat Sec

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి

పంచాయతీ శాఖలో కొత్తగా 1000 ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వీటితో పాటు గతంలో భర్తీ చేయకుండా మిగిలి ఉన్న 51 ఉద్యోగాలను కూడా కలిపి మొత్తం 1051 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి రెండు దశల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21న ప్రిలిమినరీ పరీక్షను, ఆగస్టు 2న ప్రధాన పరీక్ష (మెయిన్స్)ను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.
పంచాయతీ కార్యదర్శి పరీక్ష స్వభావం, సిలబస్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి

నోటిఫికేషన్

వెబ్‌సైట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.