యాప్నగరం

ఏపీ టెట్ వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వాయిదా పడింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

TNN 27 Dec 2017, 8:45 pm
ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వాయిదా పడింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సమయం తక్కువగా ఉందన్న విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం (డిసెంబర్ 27) ఆయన మీడియాకు తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 17 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మరో మూడు వారాలపాటు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ, హాల్ టికెట్ల జారీ తేదీల్లో మార్పులు ఉంటాయని మంత్రి గంటా తెలిపారు.
Samayam Telugu aptet postponed to be held from february 5 to 15
ఏపీ టెట్ వాయిదా..


టెట్‌ వాయిదా ప్రభావం డీఎస్సీ నిర్వహణపై ఉండదని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ర‌ద్దు చేస్తారంటూ వస్తోన్న వదంతుల్ని అభ్యర్థులెవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. డీఎస్సీని కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఫిబ్రవరి 9న పరీక్ష నిర్వహించడానికి యోచిస్తున్నామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.