యాప్నగరం

అనాథ పిల్లలకు పీహెచ్‌డీ దాకా ఉచిత విద్య

అనాథ పిల్లలకు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసేందుకు ఉచితంగా సీట్లు కేటాయించనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ (బీయూ) వెల్లడించింది.

TNN 8 Oct 2016, 12:38 pm
అనాథ పిల్లలకు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసేందుకు ఉచితంగా సీట్లు కేటాయించనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ (బీయూ) వెల్లడించింది.
Samayam Telugu bangalore university offers free education to orphan students
అనాథ పిల్లలకు పీహెచ్‌డీ దాకా ఉచిత విద్య

మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ కోర్సు కింద ఇప్పటికే ఇద్దరు బాలికలు ఉచితంగా పీజీ కోర్సులు చేస్తున్నారు.
తల్లిదండ్రులు లేని విద్యార్థులు తమ పేరంట్స్ మరణ దృవీకరణ పత్రాలతో పాటు ఆదాయ సర్టిఫికేట్లు సమర్పించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
‘యూనివర్సిటీలో కొనసాగుతున్న పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఉచితంగా అందించడమే కాదు..విద్యార్థులు ఉచిత హాస్టల్, భోజన వసతులు కూడా కల్పిస్తున్నామని’ బీయూ రిజిస్ట్రార్ కేఎన్ నింగే గౌడ వివరించారు.
‘ఒకవేళ నిర్ణిత సమయంలో విద్యార్థులు తమ కోర్సులు పూర్తిచేయకపోయినా...వాళ్లు పూర్తి చేసేంతవరకు హాస్టల్ సదుపాయం వినియోగించుకోవచ్చని’ ఆయన తెలిపారు.
అనాథ పిల్లలను నిర్ణీత సీట్ల సంఖ్య అంటూ ఏమీ లేదు. ఎంతమందైనా చేరవచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులు జనరల్ కేటగిరీలో సీట్లు పొందుతారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
కొన్నేళ్ల క్రితం ఇదే యూనివర్సిటీ ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక సీట్లు రిజర్వు చేసి ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.