యాప్నగరం

TS SSC Results 2023 Manabadi Live : 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా టాప్‌.. వికారాబాద్‌ జిల్లా లాస్ట్‌

Manabadi TS SSC 10th Results 2023: తెలంగాణ 10వ తరగతి రెగ్యులర్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. అలాగే.. ఫెయిలైన వారికి జూన్‌ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 10 May 2023, 12:45 pm
Manabadi TS SSC Results 2023 Live : తెలంగాణలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న 10వ తరగతి ఫలితాలు (TS 10th Results 2023) వచ్చేశాయి. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి 10వ తరగతి రెగ్యులర్, వొకేషనల్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. అలాగే.. ఫెయిలైన వారికి జూన్‌ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు రోల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి తమ ఫలితాలను https://bse.telangana.gov.in/ లేదా https://www.manabadi.co.in/ తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
Samayam Telugu TS SSC Results 2023


TS SSC Results 2023 చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

తాజాగా విడుదలైన ఫలితాలకు సంబంధించి ముఖ్యాంశాలివే:
  • జూన్‌ 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
  • తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో - 86.06 శాతం ఉత్తీర్ణత
  • తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో బాలురు ఉత్తీర్ణత - 84.68%
  • తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో బాలికల ఉత్తీర్ణత - 88.53%
  • 2793 స్కూల్స్‌లో వందకు వంద శాతం ఫలితాలు
  • 25 ప్రభుత్వం పాఠశాలల్లో జీరో ఫలితాలు
  • తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో నిర్మల్ జిల్లా టాప్‌
  • తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో వికారాబాద్‌ జిల్లా లాస్ట్‌

గతేడాది ఫలితాలను పరిశీలిస్తే..!
గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 80 7.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని కేజీబీవీలలో 93.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మైనార్టీ రెసిడెన్సిల్లో 93.73 శాతం, మోడల్ స్కూల్లో 97.25 శాతం ఉత్తీర్ణత, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులల్లో 97.47 మంది పాసయ్యారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలలో 95.3 శాతం మంది పాసయ్యారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 98.1 శాతం నమోదు అయింది. 9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.