యాప్నగరం

Byju's layoffs: 2500 మంది ఉద్యోగుల్ని తీసేయనున్న బైజూస్‌.. కారణం ఏమిటంటే..?

Indian edtech giant BYJU'S: ప్రస్తుతం బైజూస్‌ (BYJU'S)లో సుమారు 50 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో ప్రొడక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ విభాగాల్లో దశల వారీగా కొందరిని తీసేయనున్నట్టు పేర్కొంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 12 Oct 2022, 10:04 pm
BYJU'S to lay off 2500 employees: ప్రముఖ ఇండియన్‌ ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ దిగ్గజం బైజూస్‌ (BYJU'S) కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి (కాస్ట్‌ కటింగ్‌) వివిధ విభాగాల్లో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. BYJU’S లో పనిచేస్తున్న 50,000 మంది బలమైన వర్క్‌ఫోర్స్‌లో ఐదు శాతం మందిని దశల వారీగా హేతుబద్ధీకరిస్తారని అంచనా.
Samayam Telugu BYJUS to lay off 2500 employees


ప్రస్తుతం బైజూస్‌ (BYJU'S)లో సుమారు 50 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వీరిలో ప్రొడక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ విభాగాల్లో దశల వారీగా కొందరిని తీసేయనున్నట్టు పేర్కొంది. కొన్ని విభాగాల్లో అదనంగా పని చేస్తున్న వారిని తొలగించి, టెక్నాలజీని మెరుగు పరచడం కోసం ఈ తొలగింపు ప్రక్రియ సరైన నిర్ణయమని భావిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతోనే ఈ మార్పులు చేశాం. సంస్థ నిర్వహణకు సంబంధించి వాటాదారుల పట్ల బాధ్యతను పరిగణలోకి తీసుకుని ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో కొనసాగుతున్నామని బైజూస్ సీఈఓ మృణాల్ మోహిత్ అన్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కంపెనీ వృద్ధి పై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన వివరించారు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.