యాప్నగరం

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. అధికారికంగా వెల్లడి

2020-21 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతులకు 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్లు సీబీఎస్‌ఈ అధికారికంగా వెల్లడించింది.

Samayam Telugu 7 Jul 2020, 7:59 pm
కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం సజావుగా సాగడం లేదు. స్కూళ్లు, కాలేజీల మూత, పరీక్షలు వాయిదా, రద్దు తదితర పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 9 నుంచి 12 వ తరగతి వరకు 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
Samayam Telugu CBSE


ఇది 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

కీలక అంశాలను అలాగే ఉంచుతూ దాదాపు 30 శాతం సిలబస్‌ను హేతుబద్ధీకరించామని చెప్పారు. అయితే కుదించిన సిలబస్‌ను కూడా టీచర్లు విద్యార్థులకు బోధించాలని.. కానీ ఆ అంశాలపై అసైన్‌మెంట్స్‌, బోర్డు పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వబోమని తెలిపారు. సిలబస్‌ కుదింపు విషయంలో కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని ఆయన వెల్లడించారు.

సిలబస్‌ కుదింపునకు సంబంధించి మానవవనరుల శాఖకు ఇప్పటి వరకు 1500 పైగా నిపుణులు సలహాలు ఇచ్చారని.. వారందరికీ ధన్యవాదాలని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.