యాప్నగరం

CBSE Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలుసుకోవడం కోసం క్లిక్ చేయండి.

Samayam Telugu 26 May 2018, 12:59 pm
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగింది. 2017లో 82.02 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 83.03 శాతం నమోదైంది. త్రివేండ్రం రీజియన్ 97.32 శాతం ఉత్తీర్ణతతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 93.87 శాతం ఉత్తీర్ణతతో చెన్నై రీజియన్ రెండో స్థానంలో ఉండగా.. 89 శాతం ఉత్తీర్ణతతో ఢిల్లీ మూడోస్థానం దక్కించుకుంది. ఈ ఏడాది ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. బాలికలు 88.31 శాతం మంది ఉత్తీర్ణులవగా.. బాలురు 78.99 శాతం మంది పరీక్షలు పాసయ్యారు.
Samayam Telugu cbse


ఘజియాబాద్‌కి చెందిన మేఘనా శ్రీవాస్తవ 500కిగానూ 499 మార్కులతో టాపర్‌గా నిలవగా..అనౌనుష్క చంద్ర (498) రెండో ర్యాంకు దక్కించుకున్నారు. మూడోస్థానంలో ఏడుగురు విద్యార్థులు సంయుక్తంగా నిలవడం విశేషం. విదేశాల్లో 15,674 మంది విద్యార్థుల పరీక్షలు రాయగా.. 14,881 మంది (94.94 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మనదేశంలో నమోదైన ఉత్తీర్ణత కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. cbse.examresults.net, www.cbse.nic.in వెబ్‌సైట్లలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ పది, 12 తరగతి ఫలితాలను నేరుగా గూగుల్ సెర్చ్‌లో పొందేలా సీబీఎస్‌ఈతో గూగుల్ ఒప్పందం చేసుకుంది. CBSE Results లేదా CBSE Class 12 Results అని టైప్‌ చేసి హాల్‌టికెట్‌ నెంబరు ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.

ఈ ఏడాది మార్చి 5-ఏప్రిల్ 13 తేదీల మధ్య నిర్వహించిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11.86 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ లీక్ కావడంతో ఎకనమిక్స్ పరీక్షను మరోసారి నిర్వహించడంతో ఈ ఏడాది ఫలితాల విడుదల ఆలస్యం అవుతుందేమోనని విద్యార్థులు ఆందోళన చెందారు. కానీ నిర్ణీత సమయానికే బోర్డు రిజల్ట్స్‌ను ప్రకటించింది.

ఈసారి కేంద్రం డిజిలాకర్ ద్వారా పన్నెండో తరగతి మార్కుల షీటు పొందే సదుపాయాన్ని బోర్డు కల్పిస్తోంది. దీన్ని అండ్రాయిడ్, ఐఓస్ మొబైళ్ల ద్వారా డిజిలాకర్‌ను వాడుకోవచ్చు. 011 - 24300699 నంబర్‌కు కాల్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. 7738299899 నంబర్2కు cbse12 అని స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి స్కూల్ పేరు స్పేస్ సెంటర్ పేరును మెసేజ్ చేసి కూడా ఫలితాలు పొందొచ్చు.

గత ఏడాది సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలు మే చివరి వారంలో విడుదల కాగా, పదోతరగతి ఫలితాల జూన్ తొలి వారంలో ప్రకటించారు. ఈసారి పదోతరగతి ఫలితాలను మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే వీలుంది. 2017లో 12వ తరగతిలో దేశవ్యాప్తంగా 82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ కావడం గమనార్హం.

సీబీఎస్‌ఈని 1962లో ఏర్పాటు చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయ విద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలు సీబీఎస్ఈకి అనుబంధంగా పని చేస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.