ఈ ప్రభుత్వ యాప్ ఉంటే చాలు..జేఈఈ, నీట్లో మంచి ర్యాంక్ మీ సొంతం..!
మీరు జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రిపేరవుతున్నారా..? మంచి ర్యాంక్ కొట్టడం కోసం మాక్ టెస్టుల రాయాలనుకుంటున్నారా..? అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు కోరుకున్న ర్యాంక్ మీ సొంతమవుతుంది.
Samayam Telugu 20 May 2020, 2:25 pm
జేఈఈ మెయిన్, నీట్- 2020 పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు నమూనా పరీక్షలు (మాక్ టెస్టులు) రాసేందుకు ఉపయోగపడే ‘నేషనల్ టెస్ట్ అభ్యాస్' యాప్ను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ తాజాగా ఆవిష్కరించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభివృద్ధి చేసిన ‘నేషనల్ టెస్ట్ అభ్యాస్' యాప్ జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 24న వరకు పొడిగించినట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ వినీత్ జోషి తెలిపారు. దరఖాస్తుల్లో సవరణలకు మే 25 నుంచి 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
నీట్, జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు:
ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్), జులై 26న నీట్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభివృద్ధి చేసిన ‘నేషనల్ టెస్ట్ అభ్యాస్' యాప్ జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 24న వరకు పొడిగించినట్లు జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ వినీత్ జోషి తెలిపారు. దరఖాస్తుల్లో సవరణలకు మే 25 నుంచి 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
నీట్, జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు:
ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్), జులై 26న నీట్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.