యాప్నగరం

Amma Vodi డబ్బులో రూ.1000 కట్‌.. రూ.14 వేలు బ్యాంక్‌ ఖాతాల్లో జమ.. ఎందుకంటే..?

Amma Vodi: ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. తర్వాత ఇంటర్‌ వరకూ వర్తింపజేశారు.

Samayam Telugu 11 Jan 2021, 3:01 pm
ఏపీలో అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరులో నేడు ప్రారంభించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. తర్వాత ఇంటర్‌ వరకూ వర్తింపజేశారు.
Samayam Telugu జగనన్న అమ్మ ఒడి


ఈసారి జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48,865 మంది లబ్ధిదారులకు రూ.6,673 కోట్లు జమ చేశారు. జగనన్న అమ్మఒడికి సంబంధించి రెండవ విడత డబ్బుల్లో రూ. 15,000 కు గాను 14,000 అర్హుల ఖాతాలో.. ఇంకో రూ. 1,000 DTMF (డిస్ట్రిక్ట్ టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్)కు జమ అవుతాయి. ఈ వెయ్యి రూపాయిలను ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం వినియోగించనున్నారు.

TN: విద్యార్థులకు బంపరాఫర్‌.. ప్రతిరోజూ 2 జీబీ డేటా ఫ్రీ
అమ్మ ఒడికి బదులు ల్యాప్‌టాప్‌లు:
అమ్మ ఒడి పథకం ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మట్లాడుతూ.. విద్యార్థులకు మరికొన్ని వరాలు ప్రకటించారు. తొమ్మిదో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులు.. వచ్చే ఏడాది నుంచి అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు.. లేకపోతే డబ్బులు వద్దు.. ల్యాప్‌టాప్‌లు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ. 25వేల నుంచి రూ.27వేలు ఉంటుందని.. సాధ్యమైనంత తక్కువ ధరకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ల్యాప్‌టాప్‌లకు మూడేళ్లు వారంటీ.. పాడైతే వారంలో రీప్లేస్ చేస్తామన్నారు. వసతి దీవెన అందుకుంటున్న వారికి కూడా ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు పేదింటి పిల్లలు ఇబ్బందిపడుతున్నారని.. ఈ పరిస్థితిని మార్చాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.