యాప్నగరం

బ్రేకింగ్: సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ ప్రభావం పరీక్షలపై పడింది. కేంద్రం ఆదేశాలతో టెన్త్, 12వ తరగతి పరీక్షలను మార్చి 31 తర్వాతికి వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.

Samayam Telugu 18 Mar 2020, 11:01 pm
కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రకటించగా.. కోవిడ్ ఎఫెక్ట్ పరీక్షలపైనా పడింది. టెన్త్, ప్లస్ టూ పరీక్షలను వాయిదా వేయాలని సీబీఎస్ఈని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశించింది. దేశంలోని అన్ని పాఠశాల, యూనివర్సిటీ, ఇంజినీరింగ్, టెక్నికల్ ఎంట్రన్స్ టెస్టులను కూడా వాయిదా వేయాలని కేంద్రం సూచించింది. మార్చి 31 తర్వాత పరీక్షలను నిర్వహించేలా రీషెడ్యూల్ చేయాలని సూచించింది. మూల్యాంకనం కూడా మార్చి 31 తర్వాత నిర్వహించేలా వాయిదా వేయాలని ఆదేశించింది.
Samayam Telugu exams


కేంద్రం సూచనలతో మార్చి 19 నుంచి మార్చి 31 తేదీల మధ్య జరగాల్సిన టెన్త్, ప్లస్ 12 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. సీఏఏ అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీలో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడగా.. వాటిని కూడా మరోసారి రీషెడ్యూల్ చేయనున్నారు. పరిస్థితిని సమీక్షించి మార్చి 31 తర్వాత నూతన షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

ఇంతకు ముందు షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ పరీక్షలు ఈశాన్య ఢిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లో మార్చి 30తో పూర్తి కావాల్సి ఉంది. ఈశాన్య ఢిల్లీలో కొన్ని పరీక్షలను ఏప్రిల్ 14 వరకు సీబీఎస్ఈ రీషెడ్యూల్ చేసింది. ‘అకడమిక్ క్యాలెండర్, ఎగ్జామ్ షెడ్యూల్ ముఖ్యమే కానీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, టీచర్లతోపాటు తల్లిదండ్రుల భద్రత కూడా అంతే ముఖ్యం’ అని హెచ్ఆర్డీ సెక్రటరీ అమిత్ ఖరే తెలిపారు.

హెచ్ఆర్డీ ఆదేశాలతో యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఐఓఎస్ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడతాయి. జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ను కూడా వాయిదా వేయాలని మానవ వనరుల శాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.