యాప్నగరం

covid-19: చివరి సెమిస్టర్‌ పరీక్షలు రద్దు..గ్రేడ్లు కేటాయింపు..!

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం కూడా విద్యా సంవత్సరంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి ఈ మార్పులు చేస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు ప్రకటించారు.

Samayam Telugu 13 May 2020, 4:58 pm
కరోన వచ్చిన వేళ విశేషం ఏమో కానీ అన్నీ రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఇదే సమయంలో విద్యా రంగంలో కూడా బోధన పద్ధతులు, సిలబస్, పరీక్ష తేదీలు, పరీక్ష సమయం, ప్రశ్నపత్రం, విద్యా సంవత్సరం ఇలా అన్నీ విషయాల్లో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం కూడా విద్యా సంవత్సరంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu UOH logo


2020-21 విద్యా సంవత్సరంలో కీలక మార్పులు చేస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జూన్‌ మొదటి వారంలో జరగాల్సిన హెచ్‌సీయూ జాతీయ ప్రవేశ పరీక్షలను వాయిదా వేశారు. ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తారు. పీజీ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబరు 1 నుంచి ప్రారంభిస్తారు. ప్రవేశ పరీక్షల ఫీజు గడువును మే 22 వరకు పొడిగించారు.

పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు రద్దు:
  • హెచ్‌సీయూ పీజీ చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు ఉండవు. వారికి పరీక్షలు నిర్వహించకుండా నేరుగా గ్రేడ్లు ప్రకటిస్తారు.
  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్నల్‌ పరీక్షలు, ఇతరత్రా ప్రాజెక్టుల విషయంలో ప్రతిభ ఆధారంగా గ్రేడ్లను ప్రకటిస్తారు.
  • గ్రేడ్లతో విద్యార్థులు సంతృప్తి చెందకపోతే జులై 4 నుంచి పరీక్షలు రాయవచ్చు.
  • మిగిలిన సెమిస్టర్లకు సంబంధించి పీజీ విద్యార్థులకు జులై 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
  • ఆగస్టు 3 నుంచి పరీక్షలు ఉంటాయి. డిటెన్షన్‌ లేకుండా విద్యార్థులు తర్వాత సెమిస్టర్‌కు వెళ్లే వీలు కల్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.