యాప్నగరం

DSC SGT Eligibility: ఎస్జీటీ పోస్టులకు ఏ డిగ్రీ చదివినా అర్హులే!

గతంలో బీఏ, బీకాం, బీఎస్సీ చేసిన వారికే అవకాశం ఉండగా..తాజాగా బీఈ, బీటెక్‌, బీసీఏ, మేనేజ్‌మెంట్‌ కోర్సులతోపాటు బీఈడీ చేసిన వారికి వెసులుబాటు కల్పించారు.

Samayam Telugu 12 Nov 2018, 11:21 am
ఏపీలో డీఎస్సీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఏ బ్యాచ్‌లర్‌ డిగ్రీ పూర్తిచేసినా అర్హత లభించింది. ఈమేరకు ఏ డిగ్రీ పూర్తి చేసిన వారైనా దరఖాస్తు చేసుకునేలా ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఇప్పటి వరకు బీఏ, బీఎస్సీ, బీకాం.. ఈ మూడు డిగ్రీల వారికే ఎస్జీటీ పోస్టులకు అర్హత ఉండేది. ఫలితంగా బీటెక్‌, బీసీఏ, బీబీఏ.. తదితర డిగ్రీ కోర్సులు చేసిన వారికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎస్జీటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నవారు పాఠశాల విద్యాశాఖను ఆశ్రయించారు.
Samayam Telugu apdsc


దీనిపై స్పందించిన విద్యాశాఖ.. ఏడిగ్రీ చేసినా ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఆన్‌లైన్‌ దరఖాస్తులో ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్ఏ) పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉంటే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, డీఎస్సీకి రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (నవంబరు 10) వరకు 2.7 లక్షల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, ఇందులో 2.45 లక్షల మంది దరఖాస్తు సమర్పిచారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 16 వరకు గడువుంది.స్కూలు అసిస్టెంట్ల(ఎస్‌ఏ)కు సంబంధించి ఇంటర్మీడియట్‌లో చదివిన సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.