కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ వివిధ సర్కిల్స్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, ఒడిశాల్లోని గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి వేతనం కింద నెలకు రూ.10 వేలు వరకు అందజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మెయిల్ క్యారియర్గా విధులు నిర్వహించాలి.
గ్రామీణ్ డాక్ సేవక్: 8043
రాష్ట్రాల వారీగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్ 190, తెలంగాణ 127, కేరళ 1193, ఝార్ఖండ్ 1236, ఉత్తర్ప్రదేశ్ 5314, ఒడిశా 93.
విద్యార్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 2017 నవంబరు 20 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. మెరిట్ ప్రకారం ర్యాంకులను కేటాయించి, కేటగిరీల వారిగా ఎంపిక చేస్తారు. ఉన్నత విద్యావంతులకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. కేవలం పదో తరగతి మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: డిసెంబరు 19.
నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్
గ్రామీణ్ డాక్ సేవక్: 8043
రాష్ట్రాల వారీగా పోస్టులు: ఆంధ్రప్రదేశ్ 190, తెలంగాణ 127, కేరళ 1193, ఝార్ఖండ్ 1236, ఉత్తర్ప్రదేశ్ 5314, ఒడిశా 93.
విద్యార్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 2017 నవంబరు 20 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. మెరిట్ ప్రకారం ర్యాంకులను కేటాయించి, కేటగిరీల వారిగా ఎంపిక చేస్తారు. ఉన్నత విద్యావంతులకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. కేవలం పదో తరగతి మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: డిసెంబరు 19.
నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్