యాప్నగరం

Diwali Gift from PM Modi: ప్రధాని మోదీ భారీ దీపావళి గిఫ్ట్‌.. 75,000 మందికి జాబ్‌ ఆఫర్‌ లెటర్స్‌ ఇవ్వనున్నారు.. పూర్తి వివరాలివే

PM Modi: దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్‌ ఆఫర్‌ లెటర్స్‌ (Offer Letter) ఇవ్వనున్నారు. అలాగే.. దీపావళి (Deepavali)కి రెండు రోజుల ముందు.. అంటే.. శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 20 Oct 2022, 1:35 pm
Samayam Telugu Diwali Gift from PM Modi
Diwali Gift from PM Modi: మన ప్రధాని నరేంద్ర మోదీ యువతకు భారీ దీపావళి (Diwali) గిఫ్ట్‌ ఇవ్వనున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్‌ ఆఫర్‌ లెటర్స్‌ (Offer Letter) ఇవ్వనున్నారు. అలాగే.. దీపావళి (Deepavali)కి రెండు రోజుల ముందు.. అంటే.. శనివారం వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ప్రధాని స్పెషల్‌ గిఫ్ట్‌ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

Diwali: ఉద్యోగులకు, విద్యార్థులకు అలర్ట్‌.. దీపావళి సెలవు మార్చిన ప్రభుత్వం.. 2 రోజులు సెలవులు వచ్చేలా మార్పు..!
Diwali 2022: తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవు విషయంపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25న దీపావళి సెలవును ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా ఆ సెలవులను అక్టోబర్ 24 సోమవారానికి మార్చింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సెలవు విషయంలో ఏర్పడిన గందరగోళానికి చెక్ పడింది.

వివరాల్లోకెళ్తే.. పండితులు మాత్రం సోమవారమే దీపావళి అంటూ ప్రకటించారు. దీంతో పండగ ఒకరోజు.. సెలవు మరొక రోజు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి సెలవులు మార్చాలని వినతులు అందాయి. దీంతో ఆయా వినతులను పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ సర్కార్ సెలవు రోజును మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది. సెలవు సోమవారానికి మార్చడంతో ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజులు విద్యార్థులకు సెలవులు రానున్నాయి.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.