యాప్నగరం

డ్రెడ్జింగ్ కార్పొరేషన్- వైజాగ్‌లో ఉద్యోగాలు

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) విశాఖపట్నం కేంద్రంలోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డ్రెడ్జ్ క్యాడెట్, ట్రెయినీ మెరైన్ ఇంజినీర్, ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

TNN 23 Jul 2017, 5:53 pm
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) విశాఖపట్నం కేంద్రంలోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డ్రెడ్జ్ క్యాడెట్, ట్రెయినీ మెరైన్ ఇంజినీర్, ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ఆరు నుంచి ఏడాదిన్నర పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో డ్రెడ్జ్ క్యాడెట్‌కు నెలకు రూ.15,000, ఎలక్ట్రికల్ ఆఫీసర్‌, మెరైన్ ఇంజినీర్‌కు రూ.25,000, కోస్టల్ వెజల్ ట్రెయినీకి రూ.10,000 స్టయిపెండ్ చెల్లిస్తారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.60 నుంచి 80 వేల వరకు వేతనం చెల్లిస్తారు.
Samayam Telugu dredging corporation of india jobs notification
డ్రెడ్జింగ్ కార్పొరేషన్- వైజాగ్‌లో ఉద్యోగాలు


డ్రెడ్జ్ క్యాడెట్: 15
విద్యార్హతలు: నాటికల్ సైన్స్‌లో డిగ్రీ ఉండాలి.
ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్: 15
విద్యార్హతలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉండాలి.
ట్రెయినీ మెరైన్ ఇంజినీర్: 15
విద్యార్హతలు: మెరైన్ ఇంజినీరింగ్/ మెరైన్ సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ ఉండాలి.
వయోపరిమితి: 2017 జూన్ 30 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

కోస్టల్ వెసల్ ట్రెయినీ: 15
విద్యార్హతలు: కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2017 జూన్ 30 నాటికి 25 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసం కింద రూ.1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్‌‌తోపాటు విద్యార్హతలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. కోస్టల్ వెసల్స్ తప్ప మిగతా పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలో మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఇందులో ర్యాంకుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఆగస్టు 4

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.