యాప్నగరం

AP DSC 2018: వారంరోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్!

ఇంటర్వూలు లేకుండా, ప్రతిభ ఆధారంగా నియామకాలను చేపట్టనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

Samayam Telugu 22 Sep 2018, 9:42 am
ఏపీలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చే వారంరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం (సెప్టెంబరు 21) తెలిపారు. ఇంటర్వూలు లేకుండా, ప్రతిభ ఆధారంగా నియామకాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిగా పారదర్శకంగా నియామక ప్రక్రియ నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖతో పాటు మున్సిపల్, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం 9,275 ఉపాధ్యాయ పోస్టులు ఈ నోటిఫికేషన్‌లో ఉంటాయని మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు.
Samayam Telugu ganta


ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఇందులో టీచర్ పోస్టులతోపాటు, గ్రూప్ పోస్టులు, పోలీసు, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.