యాప్నగరం

‘కేంబ్రిడ్జ్’ పరీక్షల్లో మనోళ్లే టాప్!

ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన వివిధ అర్హత పరీక్షల్లో మనోళ్లు అధరగొట్టేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు, ఏకంగా 41 మంది భారత విద్యార్థులు ప్రపంచ స్థాయిలో టాపర్లుగా తమ సత్తా చాటారు.

TNN 18 Oct 2016, 12:01 pm
ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన వివిధ అర్హత పరీక్షల్లో మనోళ్లు అధరగొట్టేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు, ఏకంగా 41 మంది భారత విద్యార్థులు ప్రపంచ స్థాయిలో టాపర్లుగా తమ సత్తా చాటారు. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ (సీఐఈ) ప్రకటించిన వివరాల ప్రకారం.. నవంబరు 2015, మార్చి 2016, జూన్ 2016లలో కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్ఈ), కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఏఎస్ లెవల్, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఏ లెవెల్‌లో పరీక్షలు నిర్వహించారు. వీటిలో మొత్తం 101 మంది భారతీయ విద్యార్థులు టాపర్లుగా నిలిచి అర్హత సాధించారు. వీరిలో 41 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వీరికి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ‘ఔట్ స్టాండింగ్ కేంబ్రిడ్జ్ లెర్నర్ సర్టిఫికెట్’తో గుర్తించనున్నారు.
Samayam Telugu education 41 indians are cambridge schools global toppers
‘కేంబ్రిడ్జ్’ పరీక్షల్లో మనోళ్లే టాప్!

సీఐఈ సౌత్ ఆసియా రీజనల్ డైరెక్టర్ రుచిరా ఘోష్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో టీచర్లు విద్యార్థులు, వారి తల్లదండ్రులు అత్యుత్తమ ఫలితాల కోసం ఎంత కష్టపడుతున్నరనడానికి ఈ ఫలితాలే నిదర్శనం’’ అన్నారు. ఈ 41 మందిలో ఆరుగురు సాకేత్‌లోని ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందినవారు ఉన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ‘‘కేంబ్రిడ్జ్ అర్హతకు ప్రపంచ స్థాయిలో గట్టి పోటీ ఉంటుంది. అక్కడ చవడం వల్ల తమ పిల్లలు మరింత విశ్లేషాత్మక, వినూతన ఆలోచనలతో ముందుకెళ్తారని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని విశ్వ విద్యాలయాలు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.