యాప్నగరం

ఆ సిలబస్‌ ప్రకారమే పరీక్షలు.. CBSE, JEE MAIN 2021, NEET-2021 ప‌రీక్ష‌లపై కేంద్ర విద్యాశాఖ స్పష్టత

ఎన్‌ఈపీ -2020, పరీక్షలు, స్కూళ్ల పునఃప్రారంభంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ విద్యార్థులతో మాట్లాడారు.

Samayam Telugu 18 Jan 2021, 4:35 pm
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సూచించారు. జ‌న‌వ‌రి 18న‌ ఆయన కేంద్రీయ విద్యాలయ (కేవీ) విద్యార్థులతో వెబినార్‌లో మాట్లాడారు. విద్యార్థులతో నూతన జాతీయ విద్యా విధానం -2020, పరీక్షలు, స్కూళ్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దేశంలో కరోనా భయం నెలకొన్న వేళ పరీక్ష కేంద్రాలకు వెళ్లడంపై ఆందోళనే అవసరం లేదని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. గతేడాది నీట్‌ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు.
Samayam Telugu కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ఫోఖ్రియాల్


రైల్వే టికెట్లపై డిస్కౌంట్‌, ఉచిత ప్రయాణం.. స్టూడెంట్స్‌, నిరుద్యోగులకు IRCTC ఆఫర్లు.. పూర్తి వివరాలివే
తగ్గించిన సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు:
కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులను దశలవారీగా పునఃప్రారంభిస్తామన్నారు. సగం మంది విద్యార్థులు తరగతులకు హాజరైతే.. మిగతా సగం మందికి ఆన్‌లైన్‌లో తరగతులు ఉండేలా నిర్వహిస్తామన్నారు. సీబీఎస్‌ఈలో ఈ ఏడాది తగ్గించిన సిలబస్‌ ఆధారంగానే పోటీ పరీక్షలకు ప్రశ్నలు అడుగుతారా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు, జేఈఈ మెయిన్‌ 2021, నీట్‌ 2021 పరీక్షలకు తగ్గించిన సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఉంటాయని స్పష్టంచేశారు. ఆయా పరీక్షలకు సవరించిన సిలబస్‌ ఆధారంగానే విద్యార్థులు ప్రిపేర్‌ కావాల్సి ఉంటుందని తెలిపాఉ. ఆ భాగం నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి ప్రారంభమవుతాయని పోఖ్రియాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.