దేశంలోని పాఠశాల విద్యార్థులందరికీ హిందీ భాషను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. మూడో భాషగా హిందీ నేర్చుకోవడం తప్పనిసరి కాదని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ నూతన విద్యా విధాన ముసాయిదాలో పొందుపరిచిన నిబంధనను కేంద్రం సవరించింది. విద్యార్ధులు మూడో భాషగా తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకోవచ్చని పేర్కొంది. హిందీ తప్పనిసరి కాదని.. ఆప్షన్ సబ్జెక్ట్ మాత్రమేనని వెల్లడించింది. ఈ విషయమై కేంద్ర మానవరులశాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. తాము అన్ని భాషలనూ సమానంగా గౌరవిస్తామని...హిందీని తప్పనిసరి చేసే ఆలోచన లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని.. వారి అభిప్రాయం మేరకు ముసాయిదాలో సవరణలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జాతీయ నూతన విద్యా విధానానికి సంబంధించి కస్తూరీ రంగన్ కమిటీ త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించింది. ఈ క్రమంలో హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ మూడో భాషగా హిందీని తప్పని సరిగా చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే ఈ ప్రతిపాదనపై తమ అభిప్రాయాలు తెలియజేయాలంటూ కేంద్రం ప్రజాభిప్రాయం కోరింది. అయితే విద్యావ్యవస్థలో త్రిభాషా విధానం అమలు చేయాలన్న కేంద్ర యోచనపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
తమపై బలవంతంగా హిందీ భాషను రుద్ధితే ప్రతిఘటన తప్పదని ఆయా రాష్ట్రాల రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, రచయితల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో.. కేంద్రం వెనక్కు తగ్గింది. ఆరు లేదా ఏడో తరగతి (గేడ్)లో విద్యార్థులు తృతీయ భాషను ఎంచుకోవడం లేదా మార్చుకోవడం చేయవచ్చని తాజాగా ప్రకటించింది. నూతన విద్యా విధానం కేవలం ముసాయిదా మాత్రమేనని, ప్రజాభిప్రాయసేకరణ జరిపిన తర్వాతే దాని ఆమోదం ఉంటుందని స్పష్టం చేసింది.
తమపై బలవంతంగా హిందీ భాషను రుద్ధితే ప్రతిఘటన తప్పదని ఆయా రాష్ట్రాల రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, రచయితల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో.. కేంద్రం వెనక్కు తగ్గింది. ఆరు లేదా ఏడో తరగతి (గేడ్)లో విద్యార్థులు తృతీయ భాషను ఎంచుకోవడం లేదా మార్చుకోవడం చేయవచ్చని తాజాగా ప్రకటించింది. నూతన విద్యా విధానం కేవలం ముసాయిదా మాత్రమేనని, ప్రజాభిప్రాయసేకరణ జరిపిన తర్వాతే దాని ఆమోదం ఉంటుందని స్పష్టం చేసింది.