యాప్నగరం

సివిల్స్‌ ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం!

ఆంధ్రప్రదేశ్‌లో 'ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం'లో భాగంగా 'సివిల్స్‌'లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపికచేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపికచేస్తారు.

Samayam Telugu 25 May 2018, 1:58 pm
ఆంధ్రప్రదేశ్‌లో 'ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం'లో భాగంగా బీసీ, ఈబీసీ, కాపు కులాల అభ్యర్థులకు 'సివిల్స్‌'లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపికచేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 2018 ఆగస్టు నాటికి 32 సంవత్సరాలలోపు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Samayam Telugu freecoaching


మే 24 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీరికి జూన్‌ 25, 26 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను అనంతపురం జేఎన్‌టీయూ చేపట్టింది. రాతపరీక్షలో సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌కు సంబంధించిన అంశాలే ఉంటాయి. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 2 నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి 9 నెలలపాటు ఉచిత శిక్షణ ఉంటుంది. శిక్షణకాలంలో స్టైపండ్ ఇస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.