యాప్నగరం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సివిల్స్‌కు ఉచిత శిక్షణ!

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 17 Jun 2018, 7:02 pm
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు చదువుతోపాటే సివిల్స్ శిక్షణ ఇస్తారు. జాతీయస్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉద్యోగ రాతపరీక్షలతోపాటు ఎంబీబీఎస్, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్, ఐఐటీ-జేఈఈలకు గ్రామీణ విద్యార్థులకు పాఠశాల దశనుంచే అవగాహన కల్పించాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu civils


ఇందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ తదితర సివిల్ సర్వీ స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

దీంతోపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నీట్, ఐఐటీ-జేఈఈ, ఎంసెట్‌కు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో దాదాపు రెండు లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.