యాప్నగరం

పంచాయతీ కార్యదర్శి పోస్టులు.. మైనార్టీలకు ఉచిత శిక్షణ

ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 22లోగా దరఖాస్తులు సమర్పించాలి.

Samayam Telugu 11 Sep 2018, 3:41 pm
Samayam Telugu freecoaching
మైనార్టీ స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 22లోగా డిగ్రీ, ఇంటర్‌ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్, రెండు పాస్‌పోర్టు ఫొటోలు, ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం జత చేయాలన్నారు. వివరాలకు ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి సమీపంలోని నిజామియా కాంప్లెక్సు మూడో అంతస్తులోని కార్యాలయంలో లేదా 040-23236113 ఫోన్‌ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. సెప్టెంబర్‌ 26 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.

తెలంగాణలో 9355 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి బీసీ స్టడీ సెంటర్స్‌లో ఉచిత శిక్షణకు ఇప్పటికే ప్రకటన జారీచేశారు . సెప్టెంబరు 12తో ఈ గడువు ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.