యాప్నగరం

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వ సన్నద్ధమైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది.

Samayam Telugu 13 Mar 2018, 7:16 pm
పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వ సన్నద్ధమైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జి. కిషన్ మంగళవారం (మార్చి 13) ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు.
Samayam Telugu free travel in rtc buses for class 10 students in telangana
పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం


విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా.. సకాలంలో పరీక్ష కేంద్రాలకు వెళ్లేలా బస్సులు నడపాలని ఆర్టీసీని కోరినట్లు కిషన్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 11,103 పాఠశాలల నుంచి 5,38,867 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు.

గురువారం (మార్చి 15) నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.45 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కిషన్ సూచించారు.

విద్యార్థులు చూచిరాతకు (కాపీయింగ్) పాల్పడితే ఇన్విజిలేటర్‌ను కూడా బాధ్యులను చేస్తామని కిషన్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్ 18004257462కు కాల్ చేసి చెప్పవచ్చని సూచించారు. ఇప్పటికే పాఠశాలలకు హాల్ టికెట్లు పంపించామని, www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.