యాప్నగరం

Gandhi Jayanti 2022: అక్టోబర్‌ 2 గాంధీ జయంతి.. ఆ మహాత్ముని అద్భుతమైన సందేశాలను ఓ సారి స్మరించుకుందాం..

Mahatma Gandhi Jayanti 2022: అక్టోబర్‌ 2 మహాత్మా గాంధీ జయంతి (Mahatma Gandhi Jayanti) సందర్భంగా.. ఆ మహనీయుడు ఆచరించి సమస్త భారతావనికి చాటి చెప్పిన సూక్తులివే..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 28 Sep 2022, 11:41 am
Gandhi Jayanti 2022: నా జీవితమే నా సందేశం అని చాటిన మహనీయుడు గాంధీజీ. అహింసాయుత మార్గంలోనే ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం అది. మహాత్మా గాంధీ అందించిన అహింసా ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ఎంచుకున్న బాట ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఓ పాఠ్యాంశంగా మారింది. గాంధీ జీవితం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అక్టోబర్‌ 2 మహాత్మా గాంధీ జయంతి (Mahatma Gandhi Jayanti) సందర్భంగా.. ఆ మహనీయుడు ఆచరించి సమస్త భారతావనికి చాటి చెప్పిన సూక్తులివే..
Samayam Telugu Gandhi Jayanti 2022


విధి నిర్వహణకు మించిన దేశసేవ లేదు
  • వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి.. తన సర్వసాన్ని కోల్పోయినట్లే
  • క్షమ బలవంతుల లక్షణం.. దుర్భలులు ఎన్నటికీ క్షమించలేరు
  • చెడుకు సహాయ నిరాకరణ చేయడం ప్రతి మనిషీ పవిత్ర కర్తవ్యం
  • నిరక్షరాస్యతను నిర్మూలించిన నాడే.. దేశం ప్రగతి పథంలో నడుస్తుంది
  • దేశంలో మార్పు కోరుకుంటే.. ఆ మార్పు మొదట నీ నుంచే మొదలు కావాలి
  • గెలవక పోవడం ఓటమి కాదు.. మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి
  • ఔన్నత్యం సంపద వలన రాదు.. సద్గుణాల వల్ల వస్తుంది
  • సంపాదన ముఖ్యమే కానీ.. డబ్బు ఒక్కటే సంతోషాన్ని ఇవ్వలేదు
  • సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది
  • శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది
  • లేని గొప్పదనం ఉందని చెబితే.. ఉన్న గొప్పదం ఊడుతుంది
  • సహాయం చేస్తే మర్చిపో.. సహాయం పొందితే గుర్తుంచుకో..
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.