యాప్నగరం

AP DSC Notification 2018: పది వేల పోస్టులతో డీఎస్సీ, నోటిఫికేషన్ వివరాలివే!

10351 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం తెరతీసింది. నోటిఫికేషన్, పరీక్ష తేదీలను మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

Samayam Telugu 9 Jun 2018, 2:21 pm
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం తెరతీసింది. టెట్ పరీక్ష ముగిసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 10,351 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మొత్తం 10,351 ఖాళీలను భర్తీ చేయనుండగా.. 4967 ఎస్జీటీ పోస్టులు, 2977 స్కూల్ అసిస్టెంట్, 312 లాంగ్వేజ్ పండిట్లు, 1256 పీఈటీ, 59 మ్యూజిక్, 50 డ్యాన్స్ టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని, మోడల్ స్కూళ్లకు సంబంధించి 929 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి రాగానే షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు.
Samayam Telugu ganta


నోటిఫికేషన్ వివరాలు.. (సూచనప్రాయంగా):

* నోటిఫికేషన్‌ విడుదల: జూలై 6న
* దరఖాస్తు గడువు: జూలై 6 నుంచి ఆగష్టు 8 వరకు
* అప్లికేషన్ ఆన్‌లైన్ సబ్‌మిషన్: జూలై 7 - ఆగష్టు 9 వరకు
* హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 15 ఆగష్టు నుంచి
* రాత పరీక్ష: ఆగస్టు 24, 25, 26 తేదీల్లో
* ప్రాథమిక కీ: ఆగష్టు 27న
* ఫైనల్ కీ: సెప్టెంబర్ 10న
* ఫలితాల ప్రకటన: సెప్టెంబర్‌ 15న

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే టెట్ పరీక్ష నిర్వహిస్తామని గంటా శ్రీనివాస రావు తెలిపారు. జూన్ 10 -19 తేదీల మధ్య ఆన్‌లైన్ విధానంలో రోజూ ఉదయం, మధ్యాహ్నం వేళల్లో టెట్ నిర్వహిస్తామని గంటా తెలిపారు. 3.97 లక్షల మంది టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతోపాటు బెంగళూరు, చెన్నై నగరాల్లో కలిపి మొత్తం 113 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.