యాప్నగరం

కొత్తగా 4 వేల పీజీ మెడికల్ సీట్లకు కేంద్రం ఆమోదం!

ఎంబీబీఎస్ పూర్తిచేసిన తర్వాత పీజీ వైద్య కోర్సులకు పోటీ తీవ్రంగా ఉంటుంది. పరిమిత సంఖ్యలో సీట్లు, అపరిమితమైన పోటీ కారణంగా అతి కొద్దిమంది మాత్రమే పీజీ కోర్సులో చేరగలుగుతున్నారు.

TNN 2 Mar 2017, 10:53 pm
పీజీ మెడికల్ కోర్సు ఆశావాహులకు కేంద్రం నెత్తిన పాలు పోసింది. ఏకంగా 4 వేల సీట్లను అదనంగా కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్‌లో 2017-18 విద్యా సంవత్సరానికి అదనంగా 4000 పీజీ సీట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో పీజీ సీట్లకు ఆమోదం తెలపడం ఎంసీఐ చరిత్రలో ఇదే తొలిసారి.
Samayam Telugu government approves 4000 pg medical seats for 2017 18 session
కొత్తగా 4 వేల పీజీ మెడికల్ సీట్లకు కేంద్రం ఆమోదం!


ప్రస్తుతం 4 వేలతో కలిపి దేశంలోని పీజీ మెడికల్ సీట్ల సంఖ్య 35,117కు చేరుకుంది. కొత్తగా ప్రకటించిన సీట్లలో 2047 ఎండీ/ ఎంఎస్ క్లినికల్ కోర్సులకు సంబంధించినవి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని క్లినికల్ విభాగాల్లో అధ్యాపక, విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా సీట్లను కేటాయిస్తారు. దేశ వ్యాప్తంగా ఎంపికచేసిన 71 ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 1,137 సీట్లను కేటాయించారు.

మార్చి 2017 నాటికి కనీసం 1000 కంటే ఎక్కువ పీజీ మెడికల్ సీట్లను కేటాయించాలంటూ గతంలో 212 ప్రభుత్వ వైద్య కళాశాలలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. గతేడాది అదనంగా 2,147 డీఎన్బీ సీట్లను (ఎండీ/ ఎంఎస్ కోర్సుకు సమానమైంది) కేంద్రం కేటాయించింది. మిగతా 1,000 సీట్లకు కూడా ఈ మార్చిలో అనుమతి లభించే అవకాశం ఉంది. 2016-17 బడ్జెట్‌లో ప్రకటించిన 5000 పీజీ మెడికల్ సీట్ల లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.