యాప్నగరం

బాలికల విద్యలో పశ్చిమ్ బెంగాల్ టాప్!

పశ్చిమ్‌బెంగాల్‌లో బాలికలు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యలో బాలుర కంటే ముందంజలో ఉన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న మమతా బెనర్జీయే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.

TNN 21 Feb 2017, 6:32 pm
పశ్చిమ్‌బెంగాల్‌లో బాలికలు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యలో బాలుర కంటే ముందంజలో ఉన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న మమతా బెనర్జీయే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. గతేడాది జరిగిన మాధ్యమిక స్థాయి బోర్డు పరీక్షలకు బాలురతో కంటే 1,04,840 మంది బాలికలు అదనంగా హాజరయ్యారు. ఈ ఏడాది వీరి సంఖ్య మరింత పెరిగింది.
Samayam Telugu helped kanyasri scheme for girl education in west bengal
బాలికల విద్యలో పశ్చిమ్ బెంగాల్ టాప్!


గతేడాదితో పోల్చుకుంటే అదనంగా 19 వేల మంది విద్యార్థినిలు అంటే 1, 23, 814 మంది బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. బాలికల విద్య కోసం మమతా బెనర్జీ ప్రారంభించిన కన్యాశ్రీ పథకంతో దీనికి ఓ విధంగా దోహదం చేసిందని బెంగాల్ వాసులు పేర్కొంటున్నారు. బాలికల డ్రాపౌట్స్‌ను నిరోధించడానికి సీఎం మమత ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

కన్యాశ్రీ పథకం పట్ల సానుకూలత వ్యక్తమవుతోందని, అలాగే కలకత్తా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌ను దీనిపై అధ్యయనం చేయమని కోరతామని పశ్చిమ్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు కల్యాణ్‌మోయ్ గంగూలీ అన్నారు. కానీ ఈ పథకం ద్వారా ఎలాంటి ఆర్థిక సాయం ఉండదని, కేవలం బాలికల చదివిస్తున్న కుటుంబాలకు సహాయకారిగా ఉంటుందని ఆయన తెలిపారు.

బాలికల విద్య అనే లక్ష్యాన్ని కన్యాశ్రీ ద్వారా విజయవంతమైందని, దీనికి పశ్చిమ్ బెంగాల్ ఓ మంచి ఉదాహరణ అని ప్రముఖ విద్యావేత్త నృసింగోప్రసాద్ భండూరి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.